తిట్టినా తాప్సీకి క్రేజ్‌ తగ్గడం లేదు

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో బబ్లీ గాళ్‌గా తాప్సీ పలు చిత్రాల్లో నటించింది. స్టార్‌డమ్‌ అయితే సంపాదించుకోలేకపోయింది. కానీ హీరోయిన్‌గా గ్లామర్‌ పాత్రలు బాగానే పోషించింది. అయితే అనుకోకుండా బాలీవుడ్‌ ఛాన్స్‌ రావడం, ఊహించని విధంగా వరుస ఆఫర్లు వరించడంతో అక్కడ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది తాప్సి. గ్లామర్‌ పాత్రలే కాకుండా, పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలతో తాప్సిలోని నటికి గౌరవం దక్కడంతో బాలీవుడ్‌ని నెత్తికెక్కించుకొంది తాప్సీ.

అంతేనా, హీరోయిన్‌గా ఓనమాలు దిద్దిన తెలుగు ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించింది. అయినా కానీ, టాలీవుడ్‌ తాప్సీకి పట్టం కడుతూనే ఉంది. బాలీవుడ్‌కెళ్లాకా కూడా అడపా దడపా క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి టాలీవుడ్‌లో తాప్సీకి. లో బడ్జెట్‌తో సింపుల్‌గా తెరకెక్కించిన 'ఆనందోబ్రహ్మ' సినిమాలో తాప్సి నటించింది. మంచి విజయం అందుకుంది. లేటెస్టుగా ఆమె తెలుగులో 'నీవెవరో' చిత్రంలో నటిస్తోంది. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో.

బాలీవుడ్‌లో వరస సినిమాలతో బిజీగా ఉన్నా, తెలుగులో వచ్చిన ప్రతీ ఆఫర్‌నీ చిన్నదీ పెద్దదీ అనే తేడా లేకుండా అంది పుచ్చుకుంటూనే వుంటుంది. తెలుగు ఇండస్ట్రీని, తెలుగు డైరెక్టర్స్‌నీ తిట్టినా కానీ, ఆమెను ఏరి కోరి కొన్ని సినిమాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారు మన తెలుగు దర్శ, నిర్మాతలు. అలా ఎంచుకున్న సినిమాలే మొన్న 'ఆనందోబ్రహ్మ' అయినా, నిన్న 'ఘాజీ' అయినా.

ఇప్పుడు 'నీవెవరో' అయినా. ఇకపోతే బాలీవుడ్‌లో తాప్పీ 'సూర్మా', 'ముల్క్‌' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండూ ప్రత్యేకమైన సినిమాలే తాప్సీకి. పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలే. ఈ రెండు సినిమాలు కొద్ది రోజుల గ్యాప్‌లో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS