సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ!

మరిన్ని వార్తలు

పాల బుగ్గల పసిడి పువ్వులా టాలీవుడ్‌కి క్యూట్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ. కానీ, బాలీవుడ్‌కెళ్లాక తాప్సీలో వచ్చిన మెచ్యూరిటీకి టాలీవుడ్‌ దిగ్గజాలు సైతం షాకయిపోయారు. ఏరు దాటాక తెప్ప తగిలేయడం అన్న చందంగా టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌కి వెళ్లాక, ఆ స్థాయికి రావడానికి కారణమైన టాలీవుడ్‌పైనా, రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శక దిగ్గజాలపైనా విమర్శనాస్త్రాలు సంధించింది తాప్సీ.

 

అయితే అదంతా తూచ్‌ అంటూ ఇప్పుడు మళ్లీ తెలుగులోనూ ఒకటీ అరా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో పాగా వేశాకనే, తెలుగులో 'ఆనందోబ్రహ్మ' సినిమాలో నటించింది. ప్రస్తుతం 'గేమ్‌ ఓవర్‌' అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, సంచలన వ్యాఖ్యలు చేసి, తాజాగా తాప్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. 'మగాళ్లంతా డాష్‌.. విక్కీ కౌషల్‌ ఈజ్‌ ద బెస్ట్‌.. అంటూ ఓ షోలో తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఈ విక్కీ కౌషల్‌ ఎవరంటే, ప్రజెంట్‌ బాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌. విక్కీతో కలిసి 'మన్మర్జియా' సినిమాలో నటించింది తాప్సీ. ఇంతవరకూ ఎందరో బాలీవుడ్‌ హీరోలతో కలిసి పని చేసిన తాప్సీ, సడెన్‌గా మగాళ్లందిరినీ ఇలా అనేసేసరికి ఆల్‌ జెంట్స్‌ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

 

కానీ, వెంటనే లైట్‌ తీసుకున్నారు. ఏది ఏమైనా తాప్సీకి బాలీవుడ్‌ నీళ్లు పడ్డాక, కాస్త నోటి దురుసు ఎక్కువయ్యిందనే చెప్పాలి. అయితేనేం, అవకాశాలు మాత్రం పోటెత్తుతూనే ఉన్నాయి. అవి కూడా ప్రాధాన్యత ఉన్న సినిమాలు కావడమే తాప్సీలో ఈ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరిగిపోవడానికి కారణమేమో. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్‌లో 'మిషన్‌ మంగళ్‌', 'తడ్కా', 'సాంద్‌ కీ ఆంఖ్‌' తదితర చిత్రాల్లో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS