కసి కసిగా కొడతానంటోన్న వంశీ

మరిన్ని వార్తలు

రచయితలు దర్శకులవడం, అలా దర్శకులుగా మరిన రచయితలు సంచలనాలు అందుకోవడం టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు, ఇప్పుడున్న టాప్‌ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ ఒకప్పుడు రచయితలే. రచయితలుగా ఎన్నో సంచలనాలు అందుకున్న వీరు, దర్శకులుగా మారి అతి కొద్ది కాలంలోనే టాప్‌ మోస్ట్‌ దర్శకులుగా మారారు. అప్పటి వరకూ కలంతో మ్యాజిక్‌ చేసిన వీరు, డైరెక్షన్‌లో కూడా మ్యాజిక్‌ చేసి, ఆ మాయలో ఆడియన్స్‌ని ఓలలాడేలా చేశారు. ఇప్పుడదే మ్యాజిక్‌ వక్కంతం వంశీ చేసేందుకు సిద్దమవుతున్నాడు.

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఎప్పటి నుండో దర్శకుడిగా మారాలన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. 'జై లవకుశ' కంటే ముందే ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సింది వక్కంతం వంశీ. దర్శకుడిగా తన తొలి సినిమా ఎన్టీఆర్‌తోనే చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు వక్కంతం వంశీ. కానీ అది కుదరకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. లేదంటే ఎప్పుడో దర్శకుడిగా మారేవాడే. ఎన్టీఆర్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో, బన్నీతో దర్శకుడిగా తొలి సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ కాదనడంతో, బన్నీతో అదే ప్రాజెక్ట్‌ని టేకప్‌ చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌ వంశీకి ప్రెస్టీజియస్‌ ఇష్యూ అయ్యింది. ఎలాగైనా ఈ సినిమాతో హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడట వక్కంతం వంశీ. నిర్మాత లగడపాటి శిరీషాశ్రీధర్‌ ఈ సినిమాని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా రూపిందించబోతున్నారు. సీనియర్‌ నటులు శరత్‌కుమార్‌, అర్జున్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS