'గజదొంగ'ను చూసి భయపడుతోన్న హీరోలు !

మరిన్ని వార్తలు

'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. కానీ హీరో మారిపోయాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. సినిమా కూడా మొదలైనప్పటికీ సినిమా నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇప్పుడేమో హీరో దొరకట్లేదు అట. ఏ హీరో దగ్గరకు పోయినా దొంగ పాత్ర అనగానే భయపడిపోతున్నారట.

 

ఈ సినిమాలోని హీరో పాత్ర పక్కా నెగిటివ్ పాత్ర అని మన హీరోలు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడట. మరి చివరకి ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి. కాగా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.

 

ఈ బయోపిక్ లో బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పాయల్ రాజ్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. అలాగే సినిమాలో పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుందట. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ప్రయత్నిస్తున్న దర్శకుడు వంశీకృష్ణకు ఈ సినిమా అన్నా హిట్ ఇస్తోందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS