విశాఖలో గ్యాస్‌ లీక్‌: తల్లడిల్లుతున్న టాలీవుడ్

మరిన్ని వార్తలు

 తెలుగు సినీ పరిశ్రమ తల్లడిల్లిపోతోంది అందమైన నగరం విశాఖలోని ఓ పరిశ్రమ నుంచి విష వాయువులు లీక్‌ అయిన ఘటన నేపథ్యంలో. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ సహా పలువురు సినీ ప్రముఖులు విశాఖలో చోటు చేసుకున్న ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నాం.. ఈ పరిస్థితుల్లో విశాఖ నగరానికి ఈ విపత్తు రావడం బాధాకరం..’ అని తెలుగు సినీ పరిశ్రమ ముక్త కంఠంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినీ పరిశ్రమకు విశాఖ నగరంతో వున్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా షూటింగులకి అత్యంత అనుకూలమైన నగరం విశాఖపట్నం.

 

అదొక్కటే కాదు, ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నంని, విహార యాత్రల కోసం కూడా సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఎంచుకుంటుంటారు. మరోపక్క, విశాఖ నుంచి వచ్చిన చాలామంది సినీ పరిశ్రమలో తమదైన గుర్తింపు పొందారు. నాని, కళ్యాణ్‌రామ్, సురేందర్‌రెడ్డి, సునీల్‌, అల్లరి నరేష్‌, శ్రీకాంత్‌, దర్శకుడు మారుతి, రవితేజ, నాగ శౌర్య, సాయి ధరమ్ తేజ్‌, అల్లు అర్జున్‌, రామ్ పోతినేని.. ఇలా సినీ ప్రముఖులంతా విశాఖ ఘటనపై చలించిపోయారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS