మ‌హేష్ సినిమాకి రూట్ క్లియ‌ర్ చేసిన త్రివిక్ర‌మ్‌.

మరిన్ని వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌ర‌వాత‌... ప‌ర‌శురామ్ కి ఛాన్స్ ఇచ్చాడు మ‌హేష్‌. వీళ్ల కాంబినేష‌న్‌లో `స‌ర్కారు వారి పాట‌` మొద‌లు కావాలి. అమెరికాలో షూటింగ్ కోసం రంగం సిద్ధం చేసుకునేలోగా.. త్రివిక్ర‌మ్ మ‌హేష్‌ని క‌ల‌వ‌డం, ఇద్ద‌రూ సినిమా గురించి చర్చించుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఏ క్షణంలో అయినా.. త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ కాంబోలో సినిమా గురించి ప్ర‌క‌ట‌న రావొచ్చ‌న్న ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి.

 

మ‌హేష్ కూడా `మ‌రోసారి త్రివిక్ర‌మ్ తో ప‌నిచేయాల‌నివుంది` అంటూ ట్వీట్ రూపంలో త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. ఒక‌వేళ‌... మ‌హేష్‌తో సినిమా ఓకే అయితే... `స‌ర్కారువారి పాట‌`కు బ్రేకులు ప‌డి, వెన‌క్కి వెళ్లేది. కానీ ఇప్పుడు త్రివిక్ర‌మ్ త‌న ప్లానింగ్ మొత్తం మార్చేశాడు. మ‌హేష్ స్థానంలో ఓ యువ హీరోతో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. బ‌హుశా రామ్ తో త్రివిక్ర‌మ్ సినిమా ఉండొచ్చు.

 

మ‌హేష్ తో సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి ఇంకొంత స‌మ‌యం ప‌డుతుంది. దాంతో.. `స‌ర్కారు వారి పాట‌`కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు అనుకోవాలి. ఎందుకంటే.. మ‌హేష్ రెడీ అయితే, త్రివిక్ర‌మ్ కూడా సిద్ధంగా ఉంటే, స‌ర్కారువారి పాట స్థానంలో వీళ్ల కాంబోలోనే సినిమా మొద‌ల‌య్యేది. త్రివిక్ర‌మ్ మ‌రో హీరోని వెదుక్కోవ‌డంతో.. స‌ర్కారువారి పాట‌కు ఎలాంటి అడ్డంకీ లేకుండా పోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS