పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో విషాదం

మరిన్ని వార్తలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న పోరాట యాత్రలో విషాదం చోటు చేసుకుంది.  

వివరాల్లోకి వెళితే, తన యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పాయకరావు పేటలో రేపు పవన్ కళ్యాణ్ వస్తుండడంతో, ఆయన అభిమానులు 30 అడుగుల కట్ ఔట్ ని స్థానికంగా ఏర్పాటు చేసే క్రమంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కట్ అవుట్ ఏర్పాటు చేసే క్రమంలో కరెంటు తీగలకి తగలడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తున్నది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు- భీమవరపు శివ, తోలెం నాగరాజులు గా గుర్తించారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి, ఇద్దరు యువకులు ఇలా చనిపోవడం అందరిలోనూ విషాదం నింపింది.

ఈ సంఘటన పైన పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS