బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా, ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ ఫినిష్ చేస్తామని ఇప్పటికే చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. కాగా, ఊర్వశి రౌతెలా టాలీవుడ్లో తన డెబ్యూ బంపర్ హిట్ అవుతుందనే ఆశతో వుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు, సినిమాని పర్యవేక్షిస్తోన్న విషయం విదితమే.
ఇదిలా వుంటే, ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అప్పుడే చర్చలు కూడా షురూ అయ్యాయట. ఇంకా సినిమా షూటింగ్ పూర్తవుకుండానే ఓటీటీ చర్చలేంటి.? అన్న విస్మయం సినీ వర్గాల్లో జరుగుతోంది. రొమాంటిక్ అండ్ ద్రి¸ల్లింగ్ కంటెంట్ వుంటే.. అది ఓటీటీ రిలీజ్లకు అదనపు అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకే ‘బ్లాక్ రోజ్’కి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని అంటున్నారు.
అయితే, ఈ విషయమై ప్రస్తుతం చిత్ర దర్శక నిర్మాతలు పెదవి విప్పడంలేదు. ఇదిలా వుంటే, ఈ సినిమా అంతా ఒక్క రోజులో జరిగిపోయే సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందట. దీన్నొక ఎమోషనల్ థ్రిల్లర్గా చిత్ర దర్శక నిర్మాతలు అభివర్ణిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సినిమా మాంఛి హైప్ని సంపాదించుకోగలగుతోంది. వచ్చే నెలలో సినిమా హాళ్ళు తెరుచుకుంటాయనే ప్రచారం జరుగుతున్నా, ‘బ్లాక్ రోజ్’ బృందం మాత్రం ఓటీటీని నమ్ముకుని, ఆ ఫార్మాట్లోనే సినిమాని తెరకెక్కిస్తోందని సమాచారం.