Venkatesh: వెంకీ మామ ప‌రువు తీశారు క‌దండీ....!

మరిన్ని వార్తలు

వెంక‌టేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'నార‌ప్ప‌' సినిమాని ఈనెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ `అసుర‌న్‌`కి ఇది రీమేక్‌. క‌రోనా టైమ్ లో ఓటీటీలో విడుద‌లైంది. అప్ప‌ట్లో మంచి స్పంద‌న వ‌చ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల చేశారు. ఓటీటీలో మిస్ అయిన వాళ్లూ, థియేట‌ర్లో ఈ సినిమాని చూడాల‌నుకొంటున్న వాళ్లూ.. త‌ప్ప‌కుండా ఈ సినిమా చూడ్డానికి థియేట‌ర్ల‌లోకి వ‌స్తార‌ని డి.సురేష్ బాబు భావించారు. అయితే.. ఈ సినిమాని జ‌నం ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిపి ఈ సినిమాకి రూ.25 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అది ఖ‌ర్చుల‌కు కూడా స‌రిపోదు. తిరిగి సురేష్ బాబు చేబులోంచి డ‌బ్బులు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టైంది. నార‌ప్ప‌ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ఎవ‌రూ అడ‌గ‌లేదు.

 

స‌డ‌న్ గా.. సురేష్ బాబు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో వ‌దిలారు. దానికి త‌గిన ప్ర‌చారం కూడా చేసుకోలేదు. పైగా ఓటీటీల్లో ఈ సినిమాని అంతా చూసేశారు. ఇప్పుడు థియేట‌ర్ లో ప‌నిగ‌ట్టుకొని చూడాల‌న్న మూడ్ ఎవ‌రికీ లేదు. ఎలాంటి ప్ర‌చారం లేకుండా.. సైలెంట్ గా ఈ సినిమాని వ‌దిలేయ‌డం వ‌ల్ల‌.. జ‌నం దృష్టిలో ప‌డ‌లేదు. అందుకే వ‌సూళ్లు రాలేదు.వెంక‌టేష్ లాంటి అగ్ర హీరో సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తే ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణం. సురేష్ బాబు.. పని గ‌ట్టుకొని మ‌రీ వెంకీ ప‌రువు తీసిన‌ట్టైంద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS