ఈమధ్య కాలంలో మల్టీ-స్టారర్ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ లో కొత్త ట్రెండ్ కి తెర తీసిన విక్టరీ వెంకటేశ్.. తాజాగా ఆయన తన మేనల్లుడితో చేస్తున్న వెంకీ మామ సినిమా షూటింగ్ సంబందించిన వివరాలు తెలిసాయి.
వచ్చే నెల 8వ తేదీ నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ మొదలవనున్నట్టుగా ఈ షూటింగ్ లో వెంకటేష్, నాగ చైతన్య సహా ప్రధాన తారాగణం మొత్తం పాల్గోనబోతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమాలో వెంకీ, నాగ చైతన్య పక్కన ఎవరు నటిస్తున్నారు అన్న దాని పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే రకుల్ ప్రీత్ ఒక హీరోయిన్ గా ఎంపిక అయినట్టుగా చెబుతున్నారు.
జై లవ కుశ చిత్రానికి దర్శకత్వం వహించిన బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో సురేష్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు వెంకటేష్ నటిస్తున్న మరో మల్టీ స్టారర్ చిత్రం అయిన F2 కి సంబంధించి మొన్ననే మొదటి షెడ్యూల్ పూర్తవ్వడం జరిగింది.