అప్పుడు టిక్కెట్‌ ఫైట్‌.. ఇప్పుడు సూపర్‌ స్టార్‌తో 'క్లిక్‌'

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా ఆల్రెడీ మోత మోగించేస్తోంది. ఓ పక్క బాక్సాఫీస్‌ కాసుల జోరుతోనూ, మరో వైపు సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలతోనూ హోరెత్తించేస్తోంది. అయినా సినిమా ప్రమోషన్స్‌నింకా ఆపట్లేదు. ఈ పేరు చెప్పి విజయ్‌ దేవరకొండ మొత్తం చుట్టేసి వచ్చేస్తున్నాడు. 

తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో మీట్‌ అయ్యాడు విజయ్‌ దేవరకొండ. మహేష్‌ కొత్త సినిమా 'మహర్షి' సెట్‌లో విజయ్‌ దేవరకొండ, మహేష్‌ని కలిసి సందడి చేశాడు. 'గీత గోవిందం' సక్సెస్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు మనోడు. ఓ పక్క మెగాస్టార్‌ ఆశీస్సులు ఎలాగూ ఉన్నాయి. అలాగే మిగతా హీరోలతోనూ సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. అందరు హీరోలకూ అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు ఆల్రెడీ. 

ఇక యూత్‌లో చెప్పలేనంత క్రేజ్‌ సంపాదించేశాడు. అతని ఆటిట్యూడ్‌కి, సామాన్య జనమే కాదు, మిగిలిన హీరోలు కూడా ఇన్‌స్పైర్‌ అయిపోతున్నారు. అందుకే హీ ఈజ్‌ స్పెషల్‌ అనకుండా ఉండలేకపోతున్నాం. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గీత గోవిందం' సినిమా స్టోరీ, పర్‌ఫామెన్స్‌, మ్యూజిక్‌ అన్ని రకాలుగా పిచ్చ క్రేజ్‌ సంపాదించేస్తోంది. ఈ సినిమా క్రేజ్‌తో మనోడి తదుపరి సినిమాలపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లక్కీ గాళ్‌ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించింది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS