'వినయ విధేయ రామ' ట్రిపుల్‌ ధమాకా.!

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్‌ పూర్తయిపోతే నెక్స్ట్‌ కార్యక్రమం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌. చరణ్‌ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ జరగనంత ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందట. అన్నింటికీ మించి ఈ వేడుకకు బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారట. అదేంటంటే ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి ఈ ముగ్గురూ కలిసి ఈ వేదికపై మెరవనున్నారట. నిజంగా ఇది ట్రిపుల్‌ ధమాకానే కదా. 

 

'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కొన్ని ఈ సందర్భంగా రాజమౌళి నోటి వెంట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై ఇంకా ఈ ముగ్గురూ కలిసి ఒకే వేదికపై కనిపించాలంటే చాలా టైమే పడుతుంది. కానీ అభిమానులను అంతవరకూ వెయిట్‌ చేయించకూడదనుకున్నారు కాబోలు. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ త్రయం ముందే ఫ్యాన్స్‌కి ట్రిపుల్‌ కిక్‌ ఇచ్చేస్తున్నారన్న మాట. ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్‌ షెడ్యూల్‌కి త్వరలోనే రెడీ కానుంది.

 

ఈ లోగా చరణ్‌ 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కలిసి సందడి చేయనున్నారన్న న్యూస్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఒకవేళ ఇది నిజమైతే ఇరు హీరోల ఫ్యాన్స్‌కీ పట్టరాని ఆనందమే. సంక్రాంతి పండగ ముందే వచ్చేసినట్లే. అతి త్వరలోనే ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ని బోయపాటి అండ్‌ కో ప్రకటించనున్నారట. స్కెచ్‌ మామూలుగా లేదు కదా. అన్నట్లు ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూసర్‌ డివివి దానయ్యే కావడం ఈ స్కెచ్‌కి మరో ముఖ్య కారణం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS