వినయ విధేయ రాముడి' పాట వచ్చేసింది.!

మరిన్ని వార్తలు

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' పాటల సందడి మొదలైంది. డిశంబర్‌ 3 సాయంత్రం ఈ సినిమా నుండి తొలి ఆడియో సింగిల్‌ని విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రామ్‌చరణ్‌ చుక్కల్లో చంద్రుడిలా చుట్టూ అమ్మాయిలతో కలిసి కూర్చొని జాలీగా కనిపిస్తున్నాడు. అందరూ హ్యాపీ హ్యాపీగా కొబ్బరి బొండాలు తాగుతూ  పగలబడి నవ్వుతూ కనిపిస్తున్నారు.

పోస్టర్‌లో కనిపిస్తున్న ఈ నలుగురు అమ్మాయిలెవరు.? చరణ్‌కి ఏమవుతారు.? పేరులో వినయ విధేయ రాముడు.. కానీ కృష్ణుడిలా ఇలా అమ్మాయిల మధ్యన కనిపిస్తున్నాడేంటో.? మొత్తానికి పోస్టర్‌ అయితే ఫుల్‌ కలర్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇకపోతే ఆడియో సింగిల్‌ విషయానికి వస్తే, ఇదో ఫ్యామిలీ సాంగ్‌ అని పేర్కొన్నారు. 'తందాన తందాన..' అని సాగే ఈ ఆడియో సింగిల్‌ ఎలా ఉండబోతోందో అని అభిమానుల్లో అప్పుడే ఆశక్తి నెలకొంది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఆడియో సింగిల్‌ వచ్చిందంటే దాంతో పాటు కొన్ని స్టిల్స్‌ కూడా బయటికి వస్తాయి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో రాబోత్ను ఈ ఆడియో సింగిల్‌ సినిమాపై ఎలాంటి అంచనాల్ని సృష్టిస్తుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS