అనుష్క, కోహ్లీ ఒక్కటైనవేళ - ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

మరిన్ని వార్తలు

గత వారం రోజులుగా బ్రేకింగ్‌ న్యూస్‌లో ప్రచారం అవుతున్న వార్తకు తెర పడింది. ప్రచారం జరిగినట్లుగానే క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్కల వివాహం జరిగింది. అద్భుత అందాల ఇటలీ దేశం వీరి వివాహానికి వేదికైంది. 

ఎక్కువ హడావిడి లేకుండా, అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య అనుష్క, విరాట్‌ భార్యా భర్తలయ్యారు. గత వారం రోజులుగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్‌ చల్‌ చేశాయి. డిశంబర్‌ 12న వీరి వివాహం జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఒకరోజు ముందే అంటే 11 వతేదీ సోమవారమే వీరి వివాహం జరిగింది. ఉదయం వివాహం చేసుకుని, సాయంత్రం ఈ కొత్త జంట అధికారికంగా తమ వివాహ ప్రకటనను అనౌన్స్‌ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా విడుదల చేసింది. దాంతో ఇన్ని రోజుల ప్రచారానికి తెర పడినట్లయింది. 

ఏమైతేనేమి మొత్తానికి నాలుగేళ్ల వీరి ప్రేమ బంధం పెళ్లి ముడితో మరింత బలపడింది. పెళ్లి దుస్తుల్లో విరాట్‌, అనుష్కలు భలే ముచ్చటొచ్చేస్తున్నారు. వివాహం అనంతరం కొన్ని రోజులు ఇటలీలో విహరించి, ఈ జంట స్వదేశానికి తిరిగి రానున్నారు. స్వదేశంలో రెండు వివాహ విందులు ఇవ్వనున్నారట ఈ కొత్త జంట. ఈ నెల 21న కోహ్లీ ఢిల్లీలోని తాజ్‌ డిప్లమేటిక్‌ ఎన్‌క్లేవ్‌లోని దర్బార్‌ హాల్‌లో మొదటి విందు ఏర్పాటు చేయనున్నాడట. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఢిల్లీలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కానున్నారనీ సమాచారమ్‌. 

అలాగే 26న ముంబయ్‌లో మరో విందు ఉంది. ఈ విందుకు ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖ సినీ తారలు హాజరు కానున్నారు. ఆ తర్వాత కోహ్లీ అనుష్కతో కలిసి దక్షిణాఫ్రికా బయలుదేరనున్నాడట. అక్కడ మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు సాగే ఈ పర్యటనలో కోహ్లీతో పాటు అనుష్క కూడా దక్షిణాఫ్రికాలోనే ఉంటుందనీ సమాచారమ్‌. కొత్త జంట కోహ్లీ - అనుష్కలకు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS