'మహర్షి' ని పొగడ్తలతో ముంచెత్తిన వి.వి.ఎస్. లక్ష్మణ్

మరిన్ని వార్తలు

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'మహర్షి'. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాందించుకుని మహేష్ కెరీర్ లో 'ఎపిక్ బ్లాక్ బస్టర్' గా నిలిచింది. అన్ని కమర్షియల్ హంగులతో పాటు రైతులు మరియు వ్యవసాయం గురించి చెప్పి, ఒక గొప్ప సోషల్ మెసేజ్ ఇచ్చిన చిత్రం గా.. మహేష్ బాబు అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా ఉంది.

 

వ్యవసాయం గురించి మర్చిపోతున్న ఈ జనరేషన్ కి 'వీకెండ్ ఫార్మింగ్' నేర్పించిన మహర్షికి ఇటు మహేష్ అభిమానులు, అటు మూవీ లవర్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. స్వయానా మన ఉప రాష్ట్రపతి 'వెంకయ్య నాయుడు' గారు కూడా ఈ చిత్రం గురించి ట్వీట్ పెట్టి, మహేష్ బాబు మరియు మహర్షి టీం ను ప్రశంసించారు.. ఇప్పుడు ఆ వరుసలో మన తెలుగు లెజెండరీ క్రికెటర్ 'వి.వి.ఎస్ లక్ష్మణ్' కూడా చేరారు.

 

రీసెంట్ గా 'మహర్షి' చిత్రాన్ని చూసిన లక్ష్మణ్ ట్విట్టర్ లో స్పందించారు. తనకి ఆ చిత్రం బాగా నచ్చిందని, చిత్రం లో కన్వే చేసిన స్ఫూర్తిదాయకమైన అంశాలు చాలా ముఖ్యమైనవనీ, మహేష్ మరో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ట్వీట్ చేశారు. దీనికి బదులుగా మహేష్ కూడా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. విడుదలై 100 రోజులకు చేరువలో ఉన్నా, మహర్షి మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది అనడానికి ఇదే నిదర్శనం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS