త్రివిక్ర‌మ్ అందుకే రాలేదా?

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం శిల్ప‌క‌ళావేదిక‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ ఇష్టులు, స‌న్నిహితులు అంతా హాజ‌ర‌య్యారు. ఒక్క త్రివిక్ర‌మ్ త‌ప్ప‌. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య బాండింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ ఫంక్ష‌న్ అంటే... ఆయ‌న హాజ‌రు త‌ప్ప‌నిస‌రి. పైగా `వ‌కీల్ సాబ్‌` సినిమా ప‌ట్టాలెక్క‌డానికి త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన కార‌కుడు. ఈ విష‌యాన్ని `వ‌కీల్ సాబ్` వేదిక‌పై ప‌వ‌న్‌, దిల్ రాజు, వేణు శ్రీ‌రామ్ కూడా చెప్పారు. అలాంటి త్రివిక్ర‌మ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాక‌పోవ‌డం షాక్ ఇచ్చింది.

 

త్రివిక్ర‌మ్ కి క‌రోనా పాజిటీవ్ అని తేలింద‌ని, ఆయ‌న ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌య‌మై త్రివిక్ర‌మ్ గానీ, ఆయ‌న టీమ్ గానీ స్పందించ‌లేదు. ఆ కార‌ణంతోనే.. త్రివిక్ర‌మ్ ఈ కార్య‌క్ర‌మానికి రాలేదేమో అనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇదే టాపిక్ పై... త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.క‌రోనా సోకితే..దాన్ని ప్ర‌క‌టించ‌డం సామాజిక బాధ్య‌త‌. దాన్ని త్రివిక్ర‌మ్ ఎందుకు విస్మ‌రించాడో మ‌రి..?! మ‌రింత‌కీ త్రివిక్ర‌మ్ కి నిజంగానే క‌రోనా సోకిందా, లేదంటే ఇవ‌న్నీ పుకార్లా? అనేది తెలియాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS