డియర్ కామ్రేడ్ తరవాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా `వరల్డ్ ఫేమస్ లవర్`. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్. ఇజాబెల్లా, కేథిరిన్ కథానాయికలు. శుక్రవారం విడుదలై, డివైడ్ టాక్ని మూటగట్టుకుంది. క్రాంతి మాధవ్ ఎంచుకున్న కథ కొత్తగా ఉన్నా, నేరేషన్ మాత్రం బోరింగ్ గా ఉందని విమర్శకులు తేల్చేశారు. అయితే తొలి రోజు మాత్రం ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి.
తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 4.6 కోట్లు తెచ్చుకుంది ఈ సినిమా. నైజాంలో అత్యధికంగా 2 కోట్లు సాధించింది. సీడెడ్లో 40 లక్షలు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 50 లక్షలు, గుంటూరులో 42 లక్షలు తెచ్చుకుంది. ఓవర్సీస్లో రూ 3.5 కోట్ల బిజినెస్ జరిగింది. అక్కడ మాత్రం ఓపెనింగ్స్ అంత ఆశాజనకంగా లేవని సమాచారం. డివైడ్ టాక్ దృష్ట్యా శని, ఆదివారాల్లో వసూళ్లుతగ్గే అవకాశం ఉంది. తొలి వారాంతం గడిస్తే గానీ... ఆర్థికంగా ఈ సినిమా భవిష్యత్తేమిటన్నది చెప్పలేం.