బాలయ్య ‘జై సింహ’ స్టోరీ లీక్?

మరిన్ని వార్తలు

నటసింహం నందమూరి బాలకృష్ణ ‘జై సింహ’ సినిమాకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అదేంటంటే - జై సింహ చిత్రం కథ రజనీకాంత్ గతంలో నటించిన ముత్తు చిత్రం ఛాయలతో ఉంటుంది అని సమాచారం. ఈ విషయాన్ని ఈ చిత్ర రచయిత రత్నం తెలిపారు, ఇక సినిమాలో ద్వితీయార్ధం మొత్తం సెంటిమెంట్ తో నిండి ఉంటుంది అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఉండలేరు అని ధీమాగా చెబుతున్నారు.

దీనితో జై సింహ సినిమాలో సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి అని అర్ధమవ్వడంతో ఈ పండగ సీజన్ లో వచ్చే మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదే సమయంలో జై సింహ చిత్రం ఆడియో విడుదల వేదిక పైనుండే బాలకృష్ణ మాట్లాడుతూ - తమ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తానికి బాలయ్య తనలోని సెంటిమెంట్ కోణాన్ని ఈ చిత్రంతో మరోసారి బయటకి తీసుకురానున్నాడు అని తెలుస్తున్నది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS