బొంబాయి మిఠాయి అదిరిందోచ్‌

మరిన్ని వార్తలు

స్టిల్స్‌తోనే ఆకట్టుకుంది బొంబాయి మిఠాయి. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిశా పాండే, విక్రమ్‌, నిరంజన్‌ దేశ్‌ పాండే, బుల్లెట్‌ ప్రకాష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చంద్రమోహన్‌ దర్శకుడు. ఈ నెల 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత చెప్పారు. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'బొంబాయి మిఠాయి' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తెస్తున్నారు. ఇదొక భిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం. స్టిల్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కాన్సెప్ట్‌ కూడా చాలా కొత్తగా ఉండబోతోంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్‌కి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ఈ కొత్త కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్‌. అలాగే సినిమా టైటిల్‌లోనే మిఠాయి ఉంది. ఆ స్వీట్‌ సినిమా సక్సెస్‌లో కూడా ఉంటుందని ఆశిస్తున్నారు. కన్నడలోలానే తెలుగులో కూడా 'బొంబాయి మిఠాయి' మంచి విజయం సాధిస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS