DSP-మహేష్ లు ఫిక్స్ అయ్యారు...

మరిన్ని వార్తలు

స్పైడర్ చిత్రం అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వకపోయినా ఆ ఫలితం గురించి పెద్దగా ఆలోచించకుండా తన దారిలో తాను భరత్ అను నేను చిత్ర షూటింగ్ లో బిజీ అయ్యాడు మహేష్.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవికి విడుదల చేయనుండగా, వచ్చే ఏడాది మొదట్లో మహేష్-వంశీ పైడిపల్లి కలయికలో మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలుకాగా, DSP ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నాడట.

 

ఈ విషయాన్ని నిర్మాతలు దిల్ రాజు-అశ్విని దత్ సన్నిహిత వర్గాలు కూడా దృవీకరించాయి. ఇదిలా ఉంటే, DSP-Maheshల కలయికలో ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాల పాటలు హిట్ కావడం, ఇక భరత్ అను నేను చిత్రానికి కూడా దేవిశ్రీ నే సంగీతం అందించనుండడం విశేషం.

ఇక త్వరలోనే... DSP-Mahesh కలయికలో రెండు వరుస చిత్రాలు రానున్నాయనమాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS