డబ్బింగ్ చెబుతున్న సుప్రీమ్ హీరో

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ చకచక సినిమాలు చేస్తూ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు.

ఇక ఈ మధ్యనే బీవీఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న జవాన్ చిత్రం షూటింగ్ పూర్తిచేశాడు. షూటింగ్ పూర్తవ్వడంతో వెంటనే సదరు చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టేశాడు.

ఈ విషయాన్ని సాయి తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో సాయి కి జంటగా కృష్ణగాడి వీర ప్రేమగాధ ఫేం మేహ్రీన్ నటిస్తుండగా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ స్కోర్ చేస్తున్నాడు.

సో.. ఈ చిత్రం ఇంకోన్నిరోజుల్లో మనముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS