ముగ్గురు వెట‌ర‌న్ హీరోయిన్లు... ఒకే సినిమాలో!

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య చిన్న పాత్ర‌నైనా స్టార్ల‌తో చేయించ‌డం ఓ ట్రెండ్ గా మారిపోయింది. తెర నిండా స్టార్లు క‌నిపిస్తే అదో తృప్తి. మాజీ క‌థానాయిక‌ల‌కు అమ్మ‌, అత్త పాత్ర‌లు ఇచ్చి - ఆయా పాత్ర‌ల హోదాని పెంచేస్తున్నారు. అందుకే న‌దియా, మీనా లాంటి పాత‌త‌రం హీరోయిన్లు మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపిస్తున్నారు. ఇప్పుడు `ఆడాళ్లూ మీకు జోహార్లు`లో కూడా.. ఓనాటి క‌థానాయిక‌ల్ని చూసే అవ‌కాశం ద‌క్కుతోంది.

 

శ‌ర్వానంద్ - ర‌ష్మిక జోడీగా న‌టిస్తున్న చిత్రం `ఆడవాళ్లూ మీకు జోహార్లూ`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ముగ్గురు వెట‌ర‌న్ హీరోయిన్ల‌కు ఛాన్స్ దొరికింది. మూడు కీల‌క‌మైన పాత్ర‌ల్లో రాధిక‌, ఖుష్బూ, ఊర్వ‌శిల‌ను ఎంచుకున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం వీళ్లు ఈ సినిమా షూటింగ్ లోనూ పాలు పంచుకుంటున్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఈ ముగ్గురిపై కొన్ని కీల‌క‌మైన సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ‌, ఓ చ‌క్క‌టి క‌థ‌ని అందిస్తున్నామ‌ని, ప్ర‌తీ పాత్ర ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS