అమ్మమ్మ కోసం ఆది పినిశెట్టి.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం 'నీవెవరో'. పన్నెండేళ్ల తర్వాత తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ఇది. 'ఒక విచిత్రం' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఆ తర్వాత తెలుగులో సోలో హీరోగా స్ట్రెయిట్‌ సినిమాలో నటించలేదు. 

కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించాడు. ఇటీవల ఆది నటించిన 'రంగస్థలం' సినిమాతో మంచి పేరు దక్కించుకున్నాడు. నేచురల్‌ స్టార్‌ నానితో 'నిన్నుకోరి' సినిమాలో నటించాడు. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన 'సరైనోడు' చిత్రంతో విలన్‌గానూ మెప్పించాడు. ఇలా పూర్తి స్థాయిలో కాకపోయినా తెలుగులో అడపా దడపా ఇంపార్టెంట్‌ రోల్స్‌ చేస్తూ వస్తున్నాడు ఆది. ఆది పినిశెట్టి నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించాయి. 

స్ట్రెయిట్‌ మూవీస్‌ కాకపోయినా, ఆది తెలుగులో కూడా సినిమాలు చేసినట్లే అనిపిస్తుంది అందుకే. 'గుండెల్లో గోదారి' సినిమాలో ఆది హీరోగానే నటించాడు. కానీ ఆ సినిమాలో సందీప్‌ కిషన్‌ మరో హీరో కావడంతో, ఆ సినిమా ఆది సోలో హీరో మూవీ ఖాతాలోకి వెళ్లదు. కాకపోతే ఇప్పుడు రాబోతున్న 'నీవెవరో' చిత్రం మాత్రం ఆది పినిశెట్టి ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ హీరోగా రూపొందుతోన్న మూవీ. 

తమిళంలో హీరోగా నటిస్తున్నావ్‌. తెలుగులో కూడా హీరోగా ఓ మంచి సినిమా చెయ్యి అని అమ్మమ్మ ఆదిని అడిగిందట. అమ్మమ్మ కోరిక తీర్చేందుకే ఈ సినిమా ఒప్పుకున్నాడట. అందుకే ఈ సినిమాని తన అమ్మమ్మకే అంకితమిస్తున్నానని ఆది చెప్పాడు. రితికా సింగ్‌, తాప్సీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS