సినీ నటుడు నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. నిన్న సాయంత్రం ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా ాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర యాదవ్ ధృవీకరించారు.
``నా భర్త గురువారం సాయింత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించాము. 48 గంటలపాటు పరిశీలనలో ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషయమంగానే ఉంది`` అన్నారామె. కామెడీ, సీరియస్, సైడు విలన్ పాత్రల్లో రాణించాడు నర్సింగ్ యాదవ్. విలన్ గ్యాంగులో కీలక సభ్యుడిగా చాఆ సినిమాల్లో మెప్పించాడు. తెలంగాణ యాసలో నర్సింగ్ యాదవ్ పలికే సంభాషణలు, వాటిని పలికే విధానంలో నర్సింగ్ తనదైన మార్క్ చూపించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, లక్ష్మీ చిత్రాలలో మంచి పాత్రలూ దక్కాయి. నర్సింగ్ యాదవ్ కోలుకోవాలని, ఎప్పటిలా మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుందాం.