మెగాఫోన్‌ పట్టిన ఆ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

మయాళ భామ కావేరి అలియాస్‌ కళ్యాణి డైరెక్టర్‌గా మారి, ఓ బైలింగ్వల్‌ మూవీని తెరకెక్కిస్తోంది. హీరోయిన్‌గా రవితేజ, వెంకటేష్‌, జగపతిబాబు.. ఇలా పలువురు హీరోల సరసన బోలెడన్ని చిత్రాల్లో ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య అడపా దడపా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’లో విజయ్‌కి వదిన పాత్రలోనూ, ‘గీత గోవిందం’లో తల్లి పాత్రలోనూ కనిపించింది. రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’లో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది. లేటెస్ట్‌గా మెగాఫోన్‌ పట్టి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. కన్నడ నటుడు చేతన్‌ చీనుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. కె2కె ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

 

ఇకపోతే, ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్‌ని కావేరి అలియాస్‌ కళ్యాణి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్నుంచీ గ్లామర్‌కి దూరంగా, ట్రెడిషనల్‌ హీరోయిన్‌ పాత్రనే ఎంచుకుంటూ, కెరీర్‌ని నడిపించింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ తదితర భాషల్లో చాలా సినిమాల్లో నటించింది. డైరెక్షన్‌ చేయాలన్న తన కోరికను భర్త సూర్య కిరణ్‌ సూచనలు , సలహాలతో ఇన్నాళ్లకు నెరవేర్చుకోబోతంది కళ్యాణి. హోలీ సందర్భంగా డైరెక్టర్‌గా తన డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ని డేరింగ్‌ అండ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ చేతుల మీదుగా రిలీజ్‌ చేయించింది. ఇక సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS