అలనాటి ప్రముఖ నటి కృష్ణకుమారి ఇక లేరు

మరిన్ని వార్తలు

అలనాటి తెలుగు నటి కృష్ణకుమారి (83) ఇక లేరు. 

అందుతున్న సమాచారం ప్రకారం, నేటి తెల్లవారుజామున బెంగుళూరులోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తున్నది. తెలుగులో సుమారుగా 100కు పైగా చిత్రాలలో నటించి అందరిని మెప్పించిన ఈ నటీమణి మరొక ప్రముఖ నటి అయిన షావుకారు జానకికి స్వయానా చెల్లెలు. 

నవ్వితే నవరత్నాలు (1951) చిత్రంతో తెరంగేట్రం చేసిన కృష్ణకుమారి తరువాతి కాలంలో ప్రముఖ హీరోలందరితోను ఆమె నటించింది. ఇక ఆమె కెరీర్ లో జాతీయ అవార్డులతో పాటుగా నంది పురస్కారాల్ని సైతం ఆమె అందుకోగాలిగారు. ఇక ఆమె కుటుంబ విషయానికి వస్తే, అజయ్ మోహన్ అనే బెంగుళూరుకి చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్న అనంతరం నుండి ఆమె బెంగుళూరులోనే నివసిస్తున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉంది. 

ఈ వార్త తెలుసుకున్న తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నారు. మా www.iQlikmovies.com తరపున కృష్ణకుమారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS