'అదిరింది' రిలీజ్‌ ఆగిందేంది?

మరిన్ని వార్తలు

విజయ్‌ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'మెర్సల్‌', తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల కావాల్సి ఉంది. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడుదల ఆగింది. ఈ సినిమాని రూపొందించిన నిర్మాణ సంస్థ తేనాండల్‌ నుండి నిన్న రాత్రి మొదటి ప్రకటన వచ్చింది. నార్త్‌ స్టార్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయాలి. అయితే తేనాండల్‌ సంస్థ నుండి ప్రకటన రావడం, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఆ ప్రకటనని ధృవీకరించడం అన్నీ రాత్రికి రాత్రే చక చకా జరిగిపోయాయి. తెల్లారేసరికి సినిమా విడుదల ఆగిపోయిందనే న్యూస్‌ జనంలోకి వెళ్లిపోయింది. దాంతో ప్రేక్షకులు కొంచెం డిజప్పాయింట్‌ అయ్యారు. అసలింతకీ ఈ సినిమా విడుదల ఆగిపోవడానికి కారణాలేమని మాత్రం తెలియ రావడం లేదు. ఈ సినిమా సృస్టించిన సెన్సేషన్‌ సంగతి తెలిసిందే. దాంతో తెలుగు ఆడియన్స్‌లో ఈ చిత్రంపై అంచనాలున్నాయి. అలాగే చూడాలనే ఆశక్తి కూడా ఉంది. విడుదల ఆగిపోవడంతో వాటన్నింటి పైనా నీరు చల్లేసినట్లయ్యింది. మరో పక్క ఈ రోజు యంగ్‌ హీరో రామ్‌ సినిమా 'ఉన్నది ఒక్కటే జిందగీ' విడుదలవుతోంది. 'అదిరింది' విడుదల ఆగిపోవడంతో అది రామ్‌ సినిమాకి ఆదనపు అడ్వాంటేజ్‌.. కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌లో రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమ, స్నేహం రెండింటి ప్రాధాన్యతను తెలియచెప్పే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌నందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS