'మ‌హా స‌ముద్రం'లో మ‌రో హీరోయిన్‌?

మరిన్ని వార్తలు

'ఆర్‌.ఎక్స్ 100'తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. త‌దుప‌రి చిత్రంగా `మ‌హా స‌ముద్రం`ని తెర‌పైకి తీసుకొస్తున్నాడు. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడు. సిద్దార్థ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాలో క‌థానాయిక‌గా అతిథిరావు హైద‌రీ ఎంపికైంది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు క‌నిపిస్తున్నా, హీరోయిన్ ఒక్క‌ర్తే ఉంటుంద‌ని ముందు నుంచీ చిత్ర‌బృందం చెబుతోంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రంలో మ‌రో క‌థానాయిక‌కీ చోటు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

 

`మ‌హా స‌ముద్రం`లో రెండో క‌థానాయిక‌గా అనూ ఇమ్మానియేల్ ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే అను పాత్ర నిడివి కొంచెం త‌క్కువే ఉంటుంద‌ట‌. ఇద్ద‌రు హీరోయిన్లు క‌నిపిస్తున్నా, అతిథిరావు పాత్రే కీల‌క‌మ‌ని తెలుస్తోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2021 జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS