'గూఢచారి' బాబు బాగా బిజీ!

మరిన్ని వార్తలు

'క్షణం' సినిమాతో హిట్‌ కొట్టి, కుర్రోడు మంచి విషయమున్నోడు అనిపించుకున్నాడు అడవి శేష్‌. 'గూఢచారి' సినిమాతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఔట్‌పుట్‌ ఇచ్చి శభాష్‌ అనిపించుకున్నాడు. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టుకుని స్టార్ట్‌ డైరెక్టర్స్‌ రేంజ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్‌బాబుతో కలిసి 'మేజర్‌' అనే ప్రాజెక్ట్‌ని అడవి శేష్‌ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

 

మరోవైపు తన కెరీర్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన 'గూఢచారి'కి సీక్వెల్‌ రూపొందించే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా అడవి శేష్‌ పేరు హాట్‌ హాట్‌గా తెరపైకి వచ్చింది. అందుకు కారణమేంటంటే, ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులే కాకుండా, సందట్లో సడేమియా అంటూ అడవి శేష్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌నీ టేకప్‌ చేశాడు. టేకప్‌ చేయడమే కాదు, కామ్‌గా కంప్లీట్‌ చేసేశాడు. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించింది. పీవీపీ బ్యానర్‌లో రూపొందింది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్‌ బయటికి రాలేదు.

 

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తానని అడవిశేష్‌ చెబుతున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణం కూడా సస్పెన్స్‌గా సైలెన్స్‌గా జరిగిపోయింది. మరి ఈ సినిమా నుండి రాబోయే ఆ ఫస్ట్‌లుక్‌, తదితర వివరాల వెల్లడితో అడవిశేష్‌ ఎలాంటి థ్రిల్‌ కలిగిస్తాడో చూడాలి మరి. మరో రెండు మూడు నెలల్లోనే ఈ సినిమా రిలీజ్‌ కానుందనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS