'అజ్ఞాతవాసి' టాక్‌ బయటికి వచ్చేసింది

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు రాత్రి నుండే ప్రీమియర్‌ షోస్‌ పడతాయి. అయితే 'అజ్ఞాతవాసి' సినిమా ఇలా ఉంది. అలా ఉంది అంటూ ఆల్రెడీ టాక్‌ స్ప్రెడ్‌ అయిపోతోంది. ఈ మధ్య ఇలాంటి వార్తలు బాగా స్ప్రెడ్‌ అవుతున్నాయి. 

సినిమా విడుదలకు ముందే ఈ టాక్‌ సినిమా ఫలితంపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. అరబ్‌ కంట్రీస్‌లో ఫస్ట్‌ షోస్‌ పడిపోతున్నాయని చెప్పి, అక్కడి నుండే టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే ఈ సినిమాని ఇంకా ఎవ్వరూ చూసినట్లు లేదని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో జరుగుతన్న ప్రచారమంతా ఫేక్‌ అనీ, సినిమా ఫలితాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రచారమే అనిపిస్తోంది. విడుదలకు ముందే హిట్‌ అనీ, ఫట్‌ అనే అత్యుత్సాహంతో జరుగుతోన్న ప్రచారమే తప్ప ఈ న్యూస్‌లో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు. 

ఈ రోజు రాత్రి ఎలాగూ యుఎస్‌లో ప్రివ్యూ షో పడనుంది. అక్కడ షో పడ్డాక అసలు టాక్‌ బయటకొస్తుంది. అదే సమయంలో ఇక్కడ కూడా ప్రీమియర్స్‌ పడతాయి కాబట్టి. ఈ రోజు అర్ధరాత్రికే సినిమా ఎలా ఉందన్నది తేలిపోవచ్చు. ట్రైలర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రొమాన్స్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, పవన్‌ మార్క్‌ సిగ్నేచర్‌ స్టైల్స్‌ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది ట్రైలర్‌ చూశాక. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS