ఆర్.ఎక్స్ 100తో సూపర్ హిట్టు కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. అయితే రెండో సినిమా ఇప్పటి వరకూ మొదలు కాలేదు. మహా సముద్రం అనే స్క్రిప్టు పట్టుకుని ఇద్దరు ముగ్గురు హీరోల చుట్టూ తిరిగాడు. కానీ వర్కవుట్ కాలేదు. పెద్ద హీరోలకు ఈ కథ నచ్చినా, ఇప్పటికిప్పుడు కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా లేరు. వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఇంకొంత కాలం కాలయాపన చేయడం అజయ్ భూపతికి ఇష్టం లేదు.
అందుకే ఈ సినిమా కోసం ఇద్దరు యువ హీరోల్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. కార్తికేయ, విశ్వక్సేన్లతో ఈసినిమాని లాగించేయాలని భూపతి భావిస్తున్నాడట. `ఆర్.ఎక్స్ 100`తో కార్తికేయకు హిట్ ఇచ్చింది భూపతినే. అందుకే మరోసారి కార్తికేయతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరో కీలకమైన పాత్ర కోసం విశ్వక్ సేన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్పై ఓ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఈ యేడాది చివర్లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.