క్రిస్మస్ కానుకగా ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్

మరిన్ని వార్తలు

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న  ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీమణి అద్భుతమైన సాహిత్యానికి థమన్ అందించిన వీనుల విందైన సంగీతం తోడవడంతో ఈ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక రెండో పాటను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సాయంత్రం 6 గంటలకు ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS