25 కోట్లకు అదనంగా అక్షయ్‌ మరో 3 కోట్ల డొనేషన్‌.

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, సంచలన విజయాల్ని అందుకోవడంలోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌.. తన హీరోయిజంని చాటుకోవడంలో విలక్షణతను చూపే అక్షయ్‌కుమార్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరికీ షాకిచ్చేలా 25 కోట్ల రూపాయల డొనేషన్‌ని ప్రకటించిన విషయం విదితమే. తాజాగా మరో మూడు కోట్ల రూపాయల్ని అక్షయ్‌కుమార్‌ డొనేషన్‌గా ప్రకటించాడు. ఈసారి ప్రకటించిన డొనేషన్‌ మాస్క్‌లు, పీపీఈల కోసమట. ‘నన్ను స్టార్‌ హీరోగా మలచిన ప్రజల కోసం నేను ఏం చేసినా తక్కువే.. ఒకప్పుడు నా చేతిలో డబ్బులుండేవి కావు.

 

ఇప్పుడు కోట్లు సంపాదించానంటే దానికి ప్రజలే కారణం.. వారి కోసం చేస్తున్న ఈ డొనేషన్స్‌ చాలా తృప్తినిస్తున్నాయి..’ అని చెబుతున్నాడు అక్షయ్‌కుమార్‌. ఇక్కడితో అయిపోలేదని, ఇంకా చాలా చాలా చేయాల్సి వుందని అక్షయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. ఇదిలా వుంటే, అక్షయ్‌కుమార్‌కి అసలు భారత పౌరసత్వమే లేదంటూ ఎప్పటికప్పుడు ఆయన్ని వివాదాల్లోకి లాగుతుంటారు కొందరు హేటర్స్‌. అలాంటివారందరికీ అక్షయ్‌కుమార్‌ ఇప్పుడు డొనేషన్స్‌తో దిమ్మ తిరిగే సమాధానం చెబుతున్నట్లుంది కదూ.! ఏదిఏమైనా, తెరపై మాత్రమే హీరోయిజం కాదు.. అవసరమైతే ప్రజల కోసం తాము రియల్‌ హీరోలుగా మారగలమని నిరూపిస్తున్న సినీ తారలకు సెల్యూట్‌ చేయాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS