టాలీవుడ్ కథలపై బాలీవుడ్ ఆసక్తి ఎక్కువైంది. ఇక్కడి యావరేజ్ సినిమాల్ని కూడా వదలడం లేదు. అలాంటిది సూపర్ హిట్ చిత్రాల్ని, ఇండ్రస్ట్రీ రికార్డు ఇచ్చిన కథల్నీ వదలుకుంటుందా? అందుకే.. `అల వైకుంఠపురములో` రీమేక్ రైట్స్ని ఎప్పుడో తీసేసుకుంది. ఏకంగా రూ.8 కోట్లకు ఈ సినిమా రీమేక్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పుడు హీరో కూడా దొరికేశాడు.
ఈ రీమేక్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తాడని సమాచారం. ఈ మేరకు అక్షయ్తో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ఎలాంటి కథలో అయినా ఇమిడిపోవడం అక్షయ్ నైజం. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీలూ తనకు బాగా నప్పుతాయి. పైగా సౌత్ కథల దమ్మెంతో అక్షయ్కి తెలియంది కాదు. ఇక్కడి సింగం కథల్ని తనే రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. నిజానికి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని అల్లు అరవింద్ భావించారు. కానీ... 8 కోట్ల బంపర్ ఆఫర్ రావడంతో హిందీ రైట్స్ని ఇచ్చేశారు.