కిలాడీ అక్షయ్‌ భలే చిలిపిలే.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కిలాడీ అని ముద్దుగా పిలుచుకుంటారు అక్షయ్‌ కుమార్‌ని. ఈ కిలాడీ కృష్ణుడు పేరుకు తగ్గట్లుగానే ఎప్పటికప్పుడే చిలిపి పనులు చేస్తూ ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఆశ్చర్యాన్నే తాజాగా ఇంకోసారి కలిగించాడీ కిలాడీ. ఇంతకీ అక్షయ్‌ ఏం చేశాడనుకుంటున్నారా.? 100 పౌండ్లు (రూ.8539) కోసం రాడ్‌ని పట్టుకుని వేలాడారు. ఏంటి ఇదేమన్న కొత్త గేమ్‌ అనుకుంటున్నారా.? ఆగండి తొందరపడకండి. ఫుల్‌ డీటెయిల్స్‌లోకి వెళ్లిపోదాం.

 

ఆయన ప్రస్తుతం లండన్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ ఓ సైట్‌ సీయింగ్‌ ప్లేస్‌లో 'ఎక్కువ సేపు వేలాడండి.. 100 పౌండ్లు గెలుచుకోండి..' అనే ఓ యాడ్‌ చూశారు. వెంటనే ఇది నేను కూడా చేయగలను.. అంటూ అక్షయ్‌ ఆ రాడ్‌ని పట్టుకుని వేలాడారు. ఈ సీన్‌ అంతటినీ ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.'

 

ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు.. అది చాలదన్నట్లు 100 పౌండ్ల కోసం ఇలా వేలాడుతున్నారు..' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అక్షయ్‌ కిలాడీ చేష్టలకు ఆయన ఫ్యాన్స్‌ కూడా అలాగే రెస్పాన్స్‌ అవుతూ ఫన్నీగా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫీట్‌లో అక్షయ్‌ గెలిచాడా.? లేదా.? అని మాత్రం అడక్కండే. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనేలా ఫీట్లు చేయడం ఆయనకి అదో తుత్తి. ఐదు పదుల వయసులో ఆయన ఫిట్‌నెస్‌కి హ్యాట్సాఫ్‌ అని తీరాల్సిందే. అందుకే ఆయన కిలాడీ సార్ధక నామధేయుడు. ప్రస్తుతం 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS