ప్రమోషన్‌లో అక్షయ్‌ సాహసం.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ సాహసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తాడనడం నిస్సందేహం. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్‌ బిజీగా ఉంది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. బాలీవుడ్‌ హీరోలందరిలోనూ ప్రస్తుతం అక్షయ్‌కుమారే అంత బిజీగా ఉన్నాడనుకోవాలేమో. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అక్షయ్‌కుమార్‌ ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సిద్ధపడ్డాడు. సినిమాల్లేక , ఖాళీగా ఉన్నప్పుడే వెబ్‌ సిరీస్‌ ఆలోచన చేస్తారనేది ఒకప్పటి మాట. 

 

ఇప్పుడు ట్రెండ్‌ మారింది. వెబ్‌ సిరీస్‌తోనే యూత్‌కి ఎక్కువగా కనెక్ట్‌ అవడం సాధ్యపడుతోంది. ఇకపోతే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్‌ చేసిన సాహసం ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. ఒంటిపై మంటలంటించుకుని ఓ వేదికపైకొచ్చాడు అక్షయ్‌ కుమార్‌. అలా మంటలతోనే ఆ వెబ్‌ సిరీస్‌ టైటిల్‌ని ఆవిష్కరించాడు. ఒంటిపై మంటలతో ఉన్న అక్షయ్‌కుమార్‌ని చూసి సభికులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 

 

యాక్షన్‌ హీరోగా పేరున్న అక్షయ్‌కుమార్‌ ఎలాంటి టిపికల్‌ స్టంట్‌ సన్నివేశాలైనా డూప్స్‌కి పని చెప్పడు. విలక్షణ కథలు, ప్రయోగాత్మక సిననిమాలే కాదు, సినిమా కోసం ఎలాంటి సాహసాన్నైనా సునాయాసంగా చేసేస్తాడు. ప్రస్తుతం 'గుడ్‌న్యూస్‌' తదితర మూవీస్‌లో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. ఈ మధ్యనే 'రోబో 2.0' సినిమాతో సౌత్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS