'అల..' వీరిద్దరికీ సరిలేరెవ్వరూ.!

మరిన్ని వార్తలు

క్రిస్‌మస్‌ సందర్భంగా 'అల..' టీమ్‌, 'సరిలేరు నీకెవ్వరూ..' టీమ్‌ నుండి చెరో ఒక స్టిల్‌ రిలీజ్‌ చేశారు. రెండూ రెండే స్టిల్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ రొమాంటిక్‌ మోడ్‌లో ఉన్న స్టిల్స్‌ ఇవి. 'అల..' నుండి పూజా హెగ్దే - అల్లు అర్జున్‌ జంటగా కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న ఈ స్టిల్‌కి బన్నీ ఫ్యాన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే, ఈ స్టిల్‌కి ఏమాత్రం తీసిపోకుండా అనిల్‌ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరూ..' నుండి మహేష్‌ - రష్మిక మండన్నా జోడీని రిలీజ్‌ చేశాడు. కూల్‌ మూడ్‌లో ఉన్న మహేష్‌ని వెనక నుండి వచ్చి రష్మిక హగ్‌ చేసుకున్న స్టిల్‌ ఇది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది.

 

క్రిస్‌మస్‌ ఎట్మాస్పియర్‌కి ఆహ్లాదంగా రిలీజ్‌ చేసిన ఈ స్టిల్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోటా పోటీగా ఇటు మహేష్‌ ఫ్యాన్స్‌, అటు బన్నీ ఫ్యాన్స్‌ ఈ స్టిల్స్‌కి లైకులు మీద లైకులు, షేరుల మీద షేర్లు చేసేస్తూ అసలు సిసలు క్రిస్‌మస్‌ని బ్రైట్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. వీరిద్దరూ ఇలా పోటీ పడితే, నేనేం తక్కువ తిన్నానా.? అంటూ మంచోడు కళ్యాణ్‌ రామ్‌ కూడా ఓ రొమాంటిక్‌ స్టిల్‌ రిలీజ్‌ చేశాడు. హీరోయిన్‌ మెహ్రీన్‌ని బైక్‌పై ఎక్కించుకుని జాలీగా అలా ఓ ట్రిప్‌ వేసేందుకు సిద్ధమైపోయాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కళ్యాణ్‌రామ్‌ కూడా ధియేటర్స్‌లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS