'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా అనౌన్స్ చేశాక కూడా ఆ సినిమాని పట్టాలెక్కించేందుకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు. బన్నీ అభిమానులకు సహన పరీక్ష పెట్టాడు. ఎప్పుడెప్పుడు బన్నీ సినిమా పట్టాలెక్కుతుందా? అని ఎదురు చూసి, చూసి విసుగెత్తేలా చేశాడు. ప్రశ్నల రూపంలో బన్నీని చేరిన ఆ ఎదురు చూపుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు కూడా. అయితే, బన్నీ అలా ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చిందంటే, సినిమా కోసం బన్నీ చేసిన సాహసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ బన్నీ ఏం చేశాడంట.? అంటే, బరువు తగ్గాడట. ఓసీ అంతేగా? అనుకుంటే పొరపాటే. ఏకంగా 14 కిలోలు బరువు తగ్గాడట. ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ, కఠినమైన వ్యాయామాలు చేసి ఆ స్థాయిలో బరువు తగ్గాడట. అయినా ఎందుకు.? ఎప్పుడూ ఫిట్గా ఉండే బన్నీ అంత బరువు తగ్గాల్సిన అవరసరం ఎందుకొచ్చిందా.? అంటారా.? ఇంతకు ముందు సినిమాల్లో కన్నా ఈ సినిమాలో బన్నీ స్లిమ్గా కనిపించబోతున్నాడట.
త్రివిక్రమ్ సూచనల మేరకే బన్నీ బరువు తగ్గాడని తెలుస్తోంది. అయినా, సినిమా కోసం బన్నీ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయో గతం నుండీ చూస్తూనే ఉన్నాం. అలాగే 'అల వైకుంఠపురములో' సినిమా కోసం కూడా కష్టపడ్డాడట. అందుకే ఆ సినిమా అంత ఆలస్యమైదనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది.