అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా ఇది. అయితేనేం... పబ్లిసిటీ ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఓ చిన్నపాటి టీజర్ వదిలారు. పాట కూడా వినిపించేశారు. 'సామజ వరగమన' పాట యూ ట్యూబ్లో హల్ చల్ చేసింది. అంతే కాదు.. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ని అమాంతంగా పెంచేసింది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట వస్తోంది. దీపావళి సందర్భంగా చిత్రబృందం మరో గీతాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. సామజవరగమన పాట పూర్తిగా క్లాసికల్ టచ్తో సాగింది. అయితే ఈసారి మాస్ పాట వదులుతార్ట. దాన్ని ప్రమోట్ చేసే విధానం కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి.. బన్నీ పాట.. ఓ టపాసులా పేలబోతోందన్నమాట.