'అల వైకుంఠపురములో'.. ఓ రేంజ్ యాక్షన్ !

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని.. మొత్తంగా ఐదు యాక్షన్ సీక్వెన్స్ స్ వరకూ సినిమాలో ఉంటాయని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఆ ప్లాష్ బ్యాక్ లో బన్నీ డబుల్ రోల్స్ లో కనిపిస్తాడని.. అయితే కేవలం ఐదు నిముషాలు మాత్రమే బన్నీ సెకెండ్ రోల్ కి స్క్రీన్ ప్రేజన్సీ ఉంటుందట.

 

వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

 

అందుకే ఈ చిత్రానికి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ చిత్రంలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS