అలియా భట్ విషయంలో RRR చాలా బెంగ పడింది. ఈ సినిమాలో తనే కథానాయిక. మర్చి చివరి వారం నుంచి ఏప్రిల్ వరకూ ఆమె కాల్షీట్లు అందించింది. అయితే... అవి కాస్త లాక్ డౌన్ వల్ల కొట్టుకెళ్లిపోయాయి. మళ్లీ అలియా భట్ కాల్షీట్లు ఎప్పుడు ఇస్తుందో, ఆమెకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అని రాజమౌళి టీమ్ బెంగ పెట్టుకుంది. అలియా డేట్లు సర్దుబాటు కాకపోతే.. మరో కథానాయికని వెదుక్కోవాల్సిన పరిస్థితి. అప్పటికప్పుడు మరో స్టార్ నాయిక అందుబాటులోకి రావడం కూడా కష్టమే. దాంతో... సినిమా రిలీజ్ డేట్ కూడా డైలామాలో పడే ప్రమాదం ఏర్పడింది. అయితే అలియా ఇప్పుడు చిత్రబృందానికి ఓ గుడ్ న్యూస్ వినిపించింది.
మే చివరి వారం నుంచి కావల్సిన సంఖ్యలో కాల్షీట్లు ఇవ్వగలనని చిత్రబృందానికి హామీ ఇచ్చిందట. అవసరమైతే బాలీవుడ్ సినిమాల్ని కూడా పక్కన పెడతానని అలియా మాట ఇచ్చిందట. దాంతో.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టైంది. మే చివరి వారంలో అలియా సెట్లోకి రావడం ఖాయం. దానికి తగ్గట్టుగా రాజమౌళి కూడా షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారట. అలియా రాగానే.. రామ్ చరణ్ - అలియాభట్లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తారని సమాచారం అందుతోంది.