అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన `అల వైకుంఠపురములో` సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ హిట్స్లో ఒకటిగా నిలిచింది. అటు బన్నీ కెరీర్లోనూ, ఇటు త్రివిక్రమ్ కెరీర్లోనూ - ఇదే అత్యుత్తమ ఫలితం. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వబోతోంది. రీమేక్ రైట్స్ దాదాపు 8 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల తెలుగు చిత్రాలకు బాలీవుడ్లో గిరాకీ బాగా పెరిగింది. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్గా వెళ్లి, రెండొందల కోట్లు వసూలు చేసింది. అందుకే తెలుగు సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు మక్కువ చూపిస్తున్నారు. మరి బన్నీ పాత్రలో ఏ హీరో కనిపిస్తారో, ఎవరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాలి.