'మాస్క్' అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, కెరియర్ మొదటిలో చాలా ఒడిదుడుకులు చూసింది. మొదటి సినిమా డిజాస్టర్. ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. తరవాత బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో అవకాశాలకోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆఫర్స్ రాలేదు. ఎలాగో టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అవకాశం ఇవ్వటంతో ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి అందరి దృష్టిలో పడింది. నెక్స్ట్ నాగ చైతన్య తో ఒక లైలా కోసంలో హీరోయిన్ గా నటించింది. ఇక అప్పటినుంచి టాలీవుడ్ లో పూజా హవా మొదలయ్యింది.
అందరి సూపర్ స్టార్స్, స్టార్ డైరక్టర్స్ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసి మంచి పాపులర్ అయ్యింది. వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లో అవకాశాలకోసం పరిగెట్టింది. అక్కడ మొహంజదారో లో హృతిక్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ లభించింది. కానీ ఆ మూవీ కూడా హిట్ కాలేదు. తరవాత కూడా బాలీవుడ్ లో అడపాదడపా నటించినా చెప్పుకో దగిన హిట్ కానీ , గుర్తింపు కానీ రాలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు లేవు. ఆ మధ్య మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో మొదట పూజానే అనుకున్నారు కానీ తరవాత ఈమె తప్పుకుంది. దీనితో ఎక్కడా అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అల వైకుంఠపురం సినిమానే పూజాకి చివరి హిట్. తరవాత నటించిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్లే. దీనితో పూజాని ఎవరు తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. ఐరెన్ లెగ్ గా ముద్ర పడిపోయింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ బుట్ట బొమ్మ క్రేజీ ఆఫర్ అందుకుందని, ఈ సినిమాతో పూజా మళ్ళీ జోరు కొనసాగించనుందని, సినీ వర్గాల టాక్. ఐకాన్ స్టార్ బన్నీ ప్రజంట్ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తరవాత బన్నీ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శీనులతో ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జవాన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారినా అట్లీతో మొదటగా సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు , ఈ మూవీ లోనే పూజని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే బన్నీ , పూజా రెండు సినిమాల్లో నటించారు ఇవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. వీరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించటానికి సిద్ధంగా ఉన్నారని టాక్.