అల్లు అర్జున్ కి ఎవ‌రూ దొర‌క‌ట్లేదు

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `పుష్ష‌`. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అతి త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లెట్టేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకు త‌గిన ఏర్పాట్లూ జ‌రిగిపోతున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్టుకి ఓ స‌మ‌స్య వెంటాడుతూ ఉంది. అదేంటంటే ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కూ విల‌న్ ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. విజ‌య్‌సేతుప‌తి ని ముందు ఎంచుకున్నా, వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర‌వాత‌... మాధ‌వ‌న్ పేరు వినిపించింది. `స‌వ్య‌సాచి`లో మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. కాబ‌ట్టి.. మాధ‌వ‌న్ ఈ సినిమా కూడా ఒప్పుకుని ఉంటాడ‌నుకున్నారంతా.

 

అయితే `పుష్ష‌` విష‌యంలో మాధ‌వ‌న్ స్పందించాడు. పుష్ఫ‌లో తాను న‌టించ‌డం లేద‌ని, ఈ వార్త‌లలో ఏమాత్రం నిజం లేద‌ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. దాంతో.. ఈ సినిమాలో మాధ‌వ‌న్ లేడ‌ని స్ప‌ష్టం అయిపోయింది. మ‌రి మాధ‌వ‌న్ కాక‌పోతే ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఇప్ప‌టికైతే విల‌న్ ఖాయం కాలేదు. సుకుమార్ ముందున్న ప్ర‌త్యామ్నాయం.. బాబి సింహా. త‌న‌తో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. కానీ... బాబి సింహా నుంచి ఎలాంటి స్పంద‌నా రావ‌డం లేదు. మ‌రి చివ‌రికి ఎవ‌రు ఫైన‌ల్ అవుతారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS