ఈ సారి బన్నీ ప్రయోగానికి సై అంటాడా?

మరిన్ని వార్తలు

'డీజె', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలు వరుసగా నిరాశ పరచడంతో బన్నీ తదుపరి సినిమా కోసం కాస్త గ్యాప్‌ తీసుకున్న మాట వాస్తవమే. ఈ సారి తన నుండి రాబోయే సినిమా నిరాశ పరిచేలా ఉండకూడదనే యోచనతోనే బన్నీ ఇంత గ్యాప్‌ తీసుకున్నాడుట. తన తదుపరి చిత్రం కోసం అభిమానులు కాస్త ఓపిక పట్టాలని ఆల్రెడీ బన్నీ అభిమానుల్ని సముదాయించాడు కూడా. 

ఇదిలా ఉంటే, బన్నీ తర్వాతి చిత్రం విక్రమ్‌ కుమార్‌తో ఉండబోతోందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఏమై ఉంటుందనే విషయంలో ఆరా తీయగా, తాజాగా తెలిసిన సమాచారమ్‌ ప్రకారం ఇదో కొత్త రకం కాన్సెప్ట్‌ మూవీ అని తెలుస్తోంది. అది కూడా పునర్జన్మ కాన్సెప్ట్‌ అట. గతంలో 'మగధీర', 'ఈగ', 'మనం' తదితర చిత్రాలు ఈ రకంగా పునర్జన్మ నేపథ్యంలో రూపొందినవే. మంచి విజయాలు అందుకున్నాయి ఈ చిత్రాలు. 

వీటిలో 'మనం' చిత్రాన్ని రూపొందించిన విక్రమ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారన్న టాక్‌తో అంచనాలు బాగా పెరిగాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్‌ వెల్లడి కానున్నాయట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మించనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా రష్మికాని పరిశీలిస్తున్నారట. 

'సరైనోడు' సినిమా తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ అందుకోలేదు బన్నీ. సొంత బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమాతో మళ్లీ ఆ రేంజ్‌ హిట్‌ అందుకుని రేసులో ముందుకొస్తాడేమో బన్నీ చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS