బిగ్‌బాస్‌పై రష్మీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్‌' సీజన్‌ 2కి, మొదటి సీజన్‌తో పోలిస్తే అంతగా క్రేజ్‌ లేదనే చెప్పాలి. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటికి వచ్చిన తొలి కంటెస్టెంట్‌ సంజన దగ్గర్నుంచీ బయటికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రకంగా తమ క్యారెక్టర్‌ని బ్యాడ్‌ చేసుకుని బయటికి వస్తున్నవారే. ఇదో పెద్ద మచ్చలా మారింది బిగ్‌బాస్‌కి. 

ఇకపోతే హౌస్‌లో వన్‌ ఆఫ్‌ ది కంటెస్టెంట్‌ అయిన తేజస్వి మదివాడ హౌస్‌ నుండి బయటికి వచ్చాక, హౌస్‌లో కొంత వల్గారిటీ పోయిందనీ, కొంత కాంట్రవర్సీ తగ్గిందనీ అనుకునే లోపలే, బాబు గోగినేని ఆ ప్లేస్‌ని రీ ప్లేస్‌ చేశారు. మొత్తానికి హౌస్‌లో ఈ కాంట్రవర్సీలకు సెంటర్‌ ఆఫ్‌ ది టార్గెట్‌ కౌషల్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ షో మొదట్నుంచీ హౌస్‌ మేట్స్‌ అంతా కౌషల్‌కి వ్యతిరేకంగానే ఉంటూ వస్తున్నారనే భావన షో చూసిన ప్రతీ ప్రేక్షకుడికీ అర్ధమవుతోంది. అదే కౌషల్‌కి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవుతూ వస్తోంది. కౌషల్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాలో పెద్ద నెట్‌వర్కే రన్‌ అవుతోంది. 

ఒకవేళ బిగ్‌బాస్‌ షో చూడని వారికి కూడా ఈ కౌషల్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాలో రన్‌ అవుతున్న పోస్ట్‌లు చూస్తే చాలు, మొత్తం బిగ్‌బాస్‌ సినిమా అర్ధమైపోతుంది. తాజాగా యాంకర్‌ రేష్మీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కూడా. తాను బిగ్‌బాస్‌ షో చూడననీ, బిగ్‌బాస్‌కి సంబంధించిన ఇన్‌ఫర్మేషన్‌ అంతా తనకు సోషల్‌ మీడియాలోని కౌషల్‌ ఆర్మీ పోస్ట్‌లను బట్టే తెలిసిపోతోందనీ చెబుతోంది. అంతేకాదు, బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌషలే అని తేల్చేసింది కూడా. ఒకవేళ అలా కాకుంటే, కౌషల్‌ ఆర్మీని ఫేస్‌ చేయడం అంత ఆషామాషీ కాదని కూడా తేల్చేసింది రేష్మీ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS