కన్ఫ్యూజన్‌ వీడిన అల్లు వారబ్బాయ్‌.!

మరిన్ని వార్తలు

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎబీసీడీ - అమెరికా బోర్న్‌ కన్య్ఫూజ్‌డ్‌ దేశీ' రిలీజ్‌ స్లాట్‌ కోసం వెయిట్‌ చేస్తోంది. ఈ పాటికే విడుదల కావల్సిన ఈ సినిమాకి సరైన స్లాట్‌ దొరక్క వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మేలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. మధురా శ్రీధర్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లు శిరీష్‌ సరసన రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అల్లు శిరీష్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. 

 

'ఒక్క క్షణం' సినిమాతో హిట్‌ కొట్టిన అల్లు శిరీష్‌ ఆ తదుపరి నటిస్తున్న సినిమా ఇది. అంచనాలు సంగతి పక్కన పెడితే, శిరీష్‌కి చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని టాక్‌ వినిపిస్తోంది. మే 17న 'ఎబీసీడీ' విడుదల కానుంది. కాగా ఈ లోగా సినిమా ప్రమోషన్స్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ఇంతవరకూ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు ఒక్క మోషన్‌ పోస్టర్‌ తప్ప. భుజానికి బ్యాగేసుకుని హోవర్‌ బోట్‌పై అమెరికా నుండి అనకాపల్లి దాకా ట్రావెల్‌ చేసుకుంటూ కనిపించాడు ఆ మోషన్‌ పోస్టర్‌లో అల్లు శిరీష్‌. 

 

పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గానే డిజైన్‌ చేశారు. కానీ రిలీజై చాలా రోజులైంది కదా. జనం మర్చిపోయారు. ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఇంకోటి కావాల్సి ఉంది. సో ఆ దిశగా చిత్రయూనిట్‌ కసరత్తులు చేస్తోందట. త్వరలో 'ఎబీసీడీ' టీజర్‌ కానీ, ట్రైలర్‌ కానీ విడుదల చేసే యోచనలో ఉందట. అప్పుడు కానీ సినిమాపై ఓ ఐడియాకి రాలేం. మొత్తానికి మనోడు స్లాట్‌ అయితే బుక్‌ చేసుకున్నాడు. చూడాలి మరి ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటాడో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS