ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో అనేక అపోహలు వెంటాడుతున్న వేళ, పెంపుడు జంతువుల్ని కూడా చాలా మంది దూరం పెడుతున్నారు. కొందరైతే, ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువుల్ని ఇష్టం లేకున్నా, కరోనా కి భయపడి రోడ్లపై వదిలేస్తున్నారు. అయితే, జంతువుల నుండి, మనుషులకు కరోనా సోకే అవకాశం లేదంటూ, తాజాగా అక్కినేని అమల పేర్కొన్నారు. పెట్ ఏనిమల్స్ ని సంరక్షించే బ్లూ క్రాస్ సంస్థకు అక్కినేని అమల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
జంతువుల నుండి కరోనా వ్యాపిస్తుండనడానికి ఇంతవరకూ ఆధారాల్లేవనీ, సో అలాంటి అసత్య వార్తల పట్ల ఆందోళన వద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా సూచించిన వివరాలను నెటిజన్స్తో పంచుకున్నారు. అంతేకాదు, పెంపుడు జంతువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, వాటి సంరక్షణ నిమిత్తం, నగరంలోని అన్ని పశు వైద్యశాలలూ తెరిచే ఉంటాయనీ ఆమె స్పష్టం చేశారు.