లాక్డౌన్ కారణంగా సినిమా ధియేటర్స్ అన్నీ బంద్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 నుండి ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా, ఇదివరకటిలా ప్రేక్షకుల్ని ధియేటర్స్కి ఎట్రాక్ట్ చేయడం అన్నది ఉత్త మాటే. పెద్ద సినిమాల సంగతి అటుంచితే, తక్కువ బడ్జెట్తో కోటి ఆశలతో తెరకెక్కిన చిన్న సినిమాల పరిస్థితే మరీ అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో చిన్న సినిమా నిర్మాతలు సరికొత్త ఆలోచనకు తెర లేపినట్లు తెలుస్తోంది. తమ సినిమాల్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ‘ఓ పిట్టకథ’ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసి, నిర్మాతలు ఒకింత ఉపశమనం పొందిన సంగతి విదితమే.
ఇక తదుపరి రాబోయే కొన్ని చిన్న సినిమాల్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. చూశారా.? ఓటీటీకి ఈ రేంజ్లో పాపులారిటీ వస్తుందని అస్సలు ఊహించి ఉండరు కదా. కరోనా కాలం.. ఎన్నెన్ని మార్పులు తెచ్చేసింది.. అందుట్లో ఇదో పెద్ద మార్పుగా పరిగణించాలి. అన్నట్లు ఆల్రెడీ నిర్మాణం పూర్తయ్యి, రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల ప్రమోషన్స్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే చేయాలని కొందరు భావిస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.