'మీ టూ': క్లారిటీ ఉండాలంటోన్న అనసూయ.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ తనూశ్రీ దత్తా, నటుడు నానా పటేకర్‌పై చేసిన ఆరోపణల కారణంగా 'మీ టూ' ప్రకంపనలు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలను ఒక్కొక్కరుగా బయటికి చెప్పేందుకు వస్తున్నారు. ఈ విషయమై కొందరు తనూశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శిస్తున్నారు. 

తాజాగా క్రేజీ హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ ఈ విషయమై మీడియా ముఖంగా తన స్పందనను తెలిపింది. అమ్మాయిలపై లైంగిక వేధింపులు అనేవి లేవని చెప్పలేను కానీ, స్వతహాగా అమ్మాయిలు తాము ఏ పని చేస్తున్నామో ఆ పని మీద పక్కా క్లారిటీతో ఉండాలని అనసూయ చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి లైంగిక వేధింపులకూ లొంగకూడదనీ, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్థత్వాన్ని అలవర్చుకోవాలనీ అనసూయ చెప్పింది. 

అలాగే ఈ వేధింపులు అనేవి కేవలం అమ్మాయిలకే కాదు, పిల్లలకు, మగవారికీ, ఆఖరికి జెండర్‌తో సంబంధం లేకుండా అందరి విషయంలోనూ ఈ వేధింపులున్నాయనీ, అయితే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ గళం గట్టిగా వినిపించాలనీ ఆమె సూచించింది. అంతేకాదు, ఒక్క సినీ రంగానికే ఈ లైంగిక వేధింపులు పరిమితం కాదనీ, వర్కింగ్‌ ఏరియాస్‌ అన్నింట్లోనూ ఉన్నాయనీ అనసూయ చెప్పుకొచ్చింది. 

అయితే ఇంతవరకూ తాను అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదనీ అనసూయ క్లారిటీ ఇచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS